కేంద్ర హోంశాఖ బాలీవుడ్
నటి కంగనా రనౌత్కు 10 మంది
సీఆర్పీఎఫ్ కమాండోలు భద్రత కల్పిస్తారని సోమవారం తెలిపింది. తనకు భద్రత కల్పించడం
పట్ల కంగన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు. దేశభక్తిని ఎవరూ
అణచివేయలేరని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం
హిమాచల్ప్రదేశ్లోని మనాలీలో కంగన ఉంటున్నారు.
నటుడు సుశాంత్రాజ్పుత్
మరణం, కేసు
విచారణపై తీవ్ర విమర్శలు చేస్తున్న కంగన ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్తో పోల్చారు. దీంతో వివాదం ఇంకా ముదిరిపోయింది.
అంత భయమైతే ముంబై రాకండి అని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్, మహారాష్ట్ర
హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ అన్నారు. దీనికి స్పందనగా బుధవారం ముంబై వస్తున్నా
దమ్ముంటే అడ్డుకోండి అంటూ ఆదివారం శివసేన నేతలను సవాల్ చేశారు కంగన.