జనసేన పార్టీ తోడుంటే దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో రిపీట్ అవుతుందన్నారు బీజేపీ నేత కె.లక్ష్మణ్... కేంద్ర మంత్రి కిషన్రెడ్డితో కలిసి జనసేన నేత నాదెండ్ల మనోహర్ నివాసానికి వెళ్లిన ఆయన.. జనసేన అధినేత పవన్ కల్యాణ్తో చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేయాలని పవన్ను కోరామని.. పెద్ద మనసుతో ఆయన అంగీకరించారని.. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మోడీ నాయకత్వంలో హైదరాబాద్ ప్రజల కోసం కలిసి పనిచేస్తామన్న లక్ష్మణ్.. ఓవైపు.. గ్రేటర్లో పోటీ చేయాలని జనసేన శ్రేణుల నుంచి ఒత్తిడి ఉన్నా.. పవన్ పూర్తిస్థాయిలో బీజేపీకి మద్దతు తెలిపారని.. జనసేన-బీజేపీ మధ్య బంధం గ్రేటర్లోనే కాదు.. తెలంగాణలో భవిష్యత్లో జరగనున్న అన్ని ఎన్నికల్లో కొనసాగుతుందన్నారు.
కాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో జనసేన ప్రచారానికే పరిమితమైంది. జీహెచ్ఎంసీ ఎన్నికల బరి నుంచి జనసేన తప్పుకుంటున్నట్టు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే ...