Breaking News: బీజేపీ కి గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే....!

తెలంగాణలో బీజేపీ బలం పుంజుకుంటున్న వేళ ఆ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఓ వైపు ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి పలువురు నేతలు చేరుతున్నారు. అదేవేళ కాషాయం పార్టీకి ఓ నేత గుడ్ బై చెప్పేశారు.

పాలమూరు జిల్లాలో పార్టీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాలమూరు జిల్లా పర్యటనలో సందర్భంగా ఓ వివాదం తలెత్తెంది. దీంతో ఆయన పార్టీకీ రాజీనామా చేసినట్లు ప్రకటించారు.

బిజెపి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్ష పదవికి ప్రకటించిన జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ రాజీనామా చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయనను మీడియా ఫోన్లో సంప్రదించగా తన రాజీనామాను ధ్రువీకరించారు.

త్వరలో రాజీనామాకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తామని శేఖర్ మీడియాకు చెప్పారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాలమూరు ఉమ్మడి జిల్లాల పర్యటనలో ఉండగానే ఎర్ర శేఖర్ ప్రకటించడం చర్చనీయాంశమైంది అసలేం జరిగింది అన్న విషయాలు తెలియాల్సి ఉంది.