త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో టికెట్ రాలేదని బీజేపీ నాయకురాలు విజయలలితా రెడ్డి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు.
నాచారం డివిజన్ బీజేపీ నాయకురాలైన విజయలలితా రెడ్డి నాచారం టికెట్ ఆశించారు. టికెట్ రాకపోవటంతో మనస్తాపానికి గురయ్యారు. గురువారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. దీంతో అనుచరులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తనకు టికెట్ రాకుండా చేశారని ఆమె ఆరోపించారు. కాగా, బీజేపీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థుల మొదటి జాబితాను ఇది వరకే విడుదల చేసింది. 21 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.