ల్యాప్ట్యాప్ని అలాగే
అంటిపెట్టుకుని కుర్చీకే పరిమితమవుతున్నారా? అయితే మీకో షాకింగ్ విషయం. అలాంటి వారంతా నొప్పుల
బారిన పడబోతున్నారట! నడుం నొప్పి, భుజాలు, మణికట్టు, చేతుల నొప్పులతో బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని
ఐసీఎంఆర్ - నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్, ఐఐపీహెచ్
గాంధీనగర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్క్ ఫ్రం హోంలో ఉన్నవారిపై నిర్వహించిన సంయుక్త
సర్వేలో షాకింగ్ రిజల్ట్స్ వచ్చాయి. ఇంటి నుంచి పనిచేస్తున్న ఐటీ ప్రొఫెషనల్స్లో
ఈ సమస్య ఎక్కువగా కనిపించిందని చెబుతున్నారు. సుమారు 77 శాతం
మంది ఇలాంటి నొప్పుల బారిన పడినట్లు తేలింది. ఎక్కువ మందిలో నడుం కింది భాగంలో, మణికట్టు, భుజం
నొప్పులు కనిపించాయి. వాటిని మస్క్యులోస్కెలెటల్ డిజార్డర్స్ (ఎమ్మెస్డీ) గా
పరిగణిస్తారు. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఇవి ఎక్కువగా కనిపించినట్లు నిర్ధారణ
అయ్యింది.
అత్యధికంగా 32.6 శాతం
మంది నడుం కింది భాగంలో నొప్పిని అనుభవించినట్లు తెలిపారు. మెడ భాగంలో 32.1, నడుం పైభాగంలో 29.9 శాతం మంది నొప్పి ఫీలైనట్లు తేలింది. అందులోనూ
టెక్నికల్ జాబ్ చేసేవారే ఎక్కువ కావడం గమనార్హం. అత్యధికంగా 74.5 శాతం
మంది ఇలాంటి లక్షణాలు కనిపించాయని చెప్పారు. అడ్మిన్ జాబ్స్ చేసేవారిలో 56.1, మార్కెటింగ్ జాబ్ చేసేవారిలో 52.9 శాతం కనిపించాయి. డెస్క్టాప్ వినియోగిస్తున్న
వారితో పోలిస్తే ల్యాప్టాప్తో పనిచేసేవారిలో లక్షణాలు ఎక్కువగా కనిపించాయి.
ల్యాప్టాప్ వినియోగం, పని ప్రదేశంలో అనువైన సౌకర్యాలు లేకపోవడం వంటి
కారణాలతో నొప్పులు వస్తున్నట్లు రీసెర్చ్లో తేలింది. పని ప్రదేశాన్ని చక్కగా
డిజైన్ చేసుకోవడం, పని సమయంలో విరామం తీసుకోవడం వంటివి చేయడం ద్వారా
నొప్పుల బారి నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందని సర్వే చెబుతోంది.