వైఎస్ఆర్ మరణం లేని మహా నేత ..వైఎస్ జగన్



దివంగత నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అనేక మంది ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు ..ఈ సందర్భంగా ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాలను గుర్తుచేసుకుంటున్నారు ..అయితే వైఎస్ఆర్ తనయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ దగ్గర పుష్క గుచ్చం ఉంచి స్మరించుకున్నారు.

మరోవైపు వైఎస్‌ రాజశేఖరరెడ్డి 71వ జయంతిని పురస్కరించుకొని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టిన సీఎం జగన్.. ''నాన్న గారి 71వ జయంతి నేడు. ఆయన మరణం లేని మహానేత. ఆరోగ్య శ్రీ, 104, 108 సేవలు, ఫీజు రీయింబర్స్ మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, జలయజ్ఞం ఇలా ఎన్నో పథకాల రూపంలో ఆయన ఎప్పటికీ చిరంజీవే. రైతుపక్షపాతి అయిన మహానేత జయంతిని రైతుదినోత్సవంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది'' అని పేర్కొన్నారు.

అయితే ఈ ట్వీట్ పై ప్రముఖ నిర్మాత , నటుడు బండ్ల గణేష్ స్పందించాడు .. రియాక్ట్ అవుతూ '100 శాతం కరెక్ట్ జగన్ సార్' అని కామెంట్ చేయడం విశేషం.అయితే స్వతహాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన బండ్ల , ఇలా జగన్ పెట్టిన ట్వీట్ పై రిప్లై ఇవ్వడంతో పాటు సానుకూలంగా స్పందించడం గమనార్హం ..