పోలవరంలో రేపు పర్యటించనున్న సీఎం జగన్


ఏపీ సీఎం సీఎం జగన్‌ రేపు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. 2021 డిసెంబర్‌ నాటికి ఎట్టిపరిస్థితుల్లోనూ పోలవరాన్ని పూర్తి చేసి 2022 ఖరీఫ్‌కు నీళ్లిస్తామన్న సీఎం జగన్‌ ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు. పోలవరం పనుల్లో వేగం పెంచేందుకు క్షేత్ర స్థాయి పర్యటనకు సిద్ధమయ్యారు..

ఈ నేపథ్యంలో సీఎం పోలవరం సంబంధించి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం పర్యటన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పరిశీలించారు. ప్రాజెక్టు పర్యటనలో భాగంగా సీఎం జగన్‌ పోలవరం నిర్మాణ పనులతో పాటు స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌ పనులను స్వయంగా పరిశీలించనున్నారు.

అనంతరం పోలవరం నిర్మాణ పనులపై సాగునీటి శాఖ అధికారులు, కాంట్రాక్టర్లతో జగన్‌ సమీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.