ఇస్రో ఈ రోజు శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ సీ-50 రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది ..దీనితో భారత అంతరిక్ష రంగంలో మరొక కలికితురాయి చేరింది..దీనిపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి ..కరోనా టైం లో తగిన జాగ్రత్తలు తీసుకోని రాకెట్ ప్రయోగాన్ని విజయవంతం చేసిన శాస్త్రవేత్తలకు ఇస్రో చైర్మన్ శివన్ శుభాకాంక్షలు చెప్పాడు...
ఇక ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. పీఎస్ఎల్వీ సీ-50 రాకెట్ ప్రయోగం విజయవంతం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్ ప్రయోగాలు విజయవంతం కావాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.
అంతేకాకుండా పీఎస్ఎల్వీ సీ-50 రాకెట్ ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బీబీ హరిచందన్ అభినందించారు. అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో మరో మైలురాయిని అధిగమించిందని అన్నారు. కోవిడ్ సమయంలో కూడా ప్రయోగాలను విజయవంతం చేయడం ఇస్రో శాస్త్రవేత్తల అంకిత భావానికి నిదర్శనమని కొనియాడారు. భవిష్యత్లో ఇస్కో మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని గవర్నర్ ఆకాంక్షించారు.