యాంకర్ అనసూయ ప్రముఖ నటుడు జయప్రకాశ్ రెడ్డి మృతికి సంతాపం తెలిపింది. ఆయనతో ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియావేదికగా గుర్తు చేసుకుంది. టీవీ ఛానెల్ లో పనిచేసే సమయంలో జయప్రకాశ్ రెడ్డి మాట్లాడే ఆకర్షణీయమైన యాసను అనుకరించే ప్రయత్నం చేసేదానిని. మీరు ఎప్పటికీ మా హృదయంలో ఉంటారు అని అనసూయ పేర్కొంది. అయితే జయప్రకాశ్ రెడ్డి బాత్రూంలో హఠాత్తుగా గుండెపోటు రావడంతో మరణించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి .
తాజాగా అనసూయ ఇందుకు సంబంధించి ట్విట్టర్లో ఒక పోస్ట్ రాసుకొచ్చింది. చివరకు బాత్రూంను కూడా వదలడం లేదు అంటూ అసహనాన్ని వ్యక్తం చేసింది. ''నాకు ఏమి చెప్పాలో తెలియడం లేదు.. బాత్రూమ్ ని కుడా వదలట్లేదు.. ఈ రోజుల్లో మరణం విషయంలో కూడా డిగ్నిటీ ఉంది '' అని ట్వీట్ చేసింది అనసూయ.
ఇక బుల్లితెరపై అందాల యాంకర్ గా ఆదరగోడుతుంది అనసూయ. బుల్లితెరపై పలు ప్రోగ్రాంలకి యాంకర్ గా చేస్తుంది. మంచి అవకాశాలు వచ్చినప్పుడు సినిమాల్లో కూడా నటించి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా ఆకట్టుకుంది. ఆతర్వాత పలు సినిమాల్లో నటించిమెప్పించింది. అనసూయ ప్రస్తుతం రెగ్యులర్ గా సోషల్ మీడియాలో అభిమానులకు అందుబాటులో ఉంటోంది.