GHMC Elections 2020: ముగిసిన అమిత్‌ షా రోడ్డు షో... అధిక సంఖ్యలో వచ్చిన బీజేపీ నేతలు...!

జీహెచ్ఎంసీ ఎన్నికలపై బీజేపీ సీరియస్‌గా దృష్టి పెట్టింది. అందులో భాగంగానే జాతీయ నాయకులను హైదరాబాద్‌కు పిలిపించి ప్రచారం చేయిస్తోంది.

వారితో ప్రచారం చేయిస్తే ఎక్కువ ఉపయోగం ఉంటుందని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. అందులో భాగంగా బీజేపీ అగ్రనేత, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌ షా – ఇవాళ హైదరాబాద్‌లో ప్రచారం చేయనున్నారు.

పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనంతో ఆయన టూర్‌ ప్రారంభంకానుంది.అమిత్‌ షా – కాసేపట్లో హైదరాబాద్‌ వస్తారు. ఉదయం 10.45కు పాతబస్తీలో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు.

అమ్మవారిని దర్శించుకున్న తర్వాత… వారాసిగూడా చౌరస్తా నుంచి సీతాఫల్‌మండి వరకు రోడ్‌ షోలో పాల్గొంటారు అమిత్‌ షా. మధ్యాహ్నం – నాంపల్లిలోని బీజేపీ ఆఫీస్‌కు వెళ్తారు. ఎన్నికల సరళి, ప్రజల స్పందన, పోలింగ్‌ అంశాలపై పార్టీ నేతలతో చర్చించనున్నారు.

తర్వాత మీడియా సమావేశంలో పాల్గొంటారు. అనంతరం- ప్రత్యేక విమానంలో డిల్లీకి బయదేరనున్నారు అమిత్‌ షా. అమిత్‌షా పరయటన సందర్భంగా భారీ భద్రత ఏర్పాటు చేశారు. పాతబస్తీలో భారీగా కేంద్ర బలగాలు మోహరించారు.

అమిత్‌ షా – తన ప్రచారంలో ఏయే అంశాలను ప్రస్తావిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. గ్రేటర్‌ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయన ఎలాంటి వరాలు ప్రకటిస్తారో చూడాలి మరి.