ప్రకృతి వైపరీత్యాల వల్ల
ఏర్పడిన వరదల కారణంగా తెలంగాణలో జరగాల్సిన అన్ని రకాల పరీక్షలు దసరా వరకు వాయిదా
వేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న, జరగాల్సిన
అన్ని రకాల పరీక్షలను దసరా వరకు వాయిదా వేసినట్లు విద్యా శాఖ మంత్రి సబితా
ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంగళవారం ట్విట్టర్
ద్వారా తెలిపారు. వరదల వల్ల సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో ఎప్పుడు లేని
విధంగా పడ్డ భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలను వాయిదా
వేయాలని యూనివర్సిటీలను ఆదేశించామని పేర్కొన్నారు. మంత్రి ఆదేశాల మేరకు యూని
వర్సిటీలు కూడా ఈనెల 21, 22, 23 తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షలు వాయిదా వేస్తు
న్నట్లు ప్రకటించాయి. దసరా తర్వాత పరీక్షలు యథావిధిగా ఉంటాయని వెల్లడించాయి. 27వ తేదీ
పరీక్షలు యథావిధిగా జరుగు తాయని జేఎన్టీయూ వెల్లడించింది.