ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు
ఆర్.నారాయణమూర్తి ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్ రెడ్డిపైఓ రేంజ్లో పొగడ్తలు చేసారు. ఏలేరు, తాండవ
రిజర్వాయర్లను అనుసంధానించడం ద్వారా తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లోని
మెట్ట ప్రాంతాలకు నీరు అందించి, ఆ ప్రాంతాలను సస్యశ్యామలం చేయొచ్చని అన్నారు.
ఈ ప్రాజెక్ట్కు ఆమోదం
తెలిపిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రెండు జిల్లాల్లోని
మెట్ట ప్రాంత రైతు సమస్యల శాశ్వత పరిష్కారానికి చొరవ చూపిన అపర భగీరథుడు జగన్ అని
ప్రశంసలు కురిపించారు. ఉత్తరాంధ్రలో 50 శాతానికిపైగా మెట్ట ప్రాంతాలు ఉన్నాయని, దీంతో
ఈ ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వలస పోతున్నారని ఆర్.నారాయణమూర్తి ఆవేదన
వ్యక్తం చేశారు.
తాండవ రిజర్వాయర్ నుంచి
మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందించాలన్న తన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించి..
వెంటనే తగిన కార్యాచరణ చేపట్టడం జగన్ చిత్తశుద్ధికి నిదర్శనమని నారాయణమూర్తి
కొనియాడారు. రూ.500 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ అనుసంధాన ప్రాజెక్ట్తో
తాండవ, ఏలేరు
ఆయకట్టుకు సాగునీరు అందుతుందని ఆర్.నారాయణమూర్తి పేర్కొన్నారు. సీఎం జగన్
తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడుతుందని నారాయణమూర్తి
ప్రశంసించారు.