తమిళనాడులో కరోనా మహమ్మారి ఉధృతి ఇంకా తగ్గలేదు. రోజూ వేలల్లో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. బుధవారం కూడా కొత్తగా 5,175 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
దీంతో తమిళనాడులో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,73,460కి చేరింది. అందులో 2,14,815 మంది ఇప్పటికే వైరస్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరో 54,184 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇక, కరోనా మరణాలు కూడా తమిళనాడులో భారీగానే నమోదవుతున్నాయి. బుధవారం కూడా కొత్తగా 112 మంది కరోనా బాధితులు పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,461కి చేరింది. తమిళనాడు ఆరోగ్యశాఖ ఈ వివరాలను వెల్లడించింది.