వరంగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 20 నుండి 26 సమత్సరాల మధ్య గల ఐదుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
బుధవారం తెల్లవారుజామున దామెర మండలం పసరగొండ క్రాస్ రోడ్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఎదురుగా వస్తున్న కారును వేగంగా ఢీకొట్టించాడు. దాంతో కారులో ఉన్న యువకులు మేకల ప్రవీణ్, మేకల రాజేష్, మేడి పవన్, రోహిత్, రహీంలు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని ఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.
చీకటిలో రోడ్ పైన వెళ్లేప్పుడు చాల అప్రమత్తంగా ఉండాలి ..ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్న ప్రాణాలు గాలిలో కలుస్తాయి అనడానికి ఈ ఉదంతమే ఉదాహరణ ..ఎంతో భవిష్యత్ ఉన్న అయిదుగురు యువకులు ,ఎవ్వరికి ఇంకా 30 ఏళ్ళు కూడా దాటలేదు కానీ అప్పుడే తిరిగి రాని లోకాలకు వెళ్లారు అని తెలిసి స్థానికులు కంటతడి పెడుతున్నారు.