నారాయణపేట జిల్లాలో కారు బోల్తా ...నలుగురు దుర్మరణం


తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది...హైద్రాబాదు నుంచి రాయచూరు వెళ్తున్న కారు మార్గం మధ్యలో జిల్లాలోని ముక్తల్ మండలం గుడిగండ్ల సమీపంలో బోల్తా పడింది...

ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఓ ఐదేళ్ల చిన్నారితో పాటు ఐదుగురు వ్యక్తులు ఉన్నారు.

ఈ ప్రమాదానికి కారణం అతి వేగం అని తెలుస్తుంది ...వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం సంభవించింది.. ఇక, ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ చిన్నారి షాక్‌లో ఉండిపోయింది.