బుధవారం రోజున మహారాష్ట్రలో 2250 కరోనా పాజిటివ్ కేసులు


బుధవారం ఒక్కరోజే మహారాష్ట్రలో 2250 కరోనా పాజిటి వ్ కేసులు నమోదయినట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. రోజురోజుకూ కొరోనా కేసుల సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.బుధవారంనాడు కూడా మహారాష్ట్రలో అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి.


కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 39297 కు చేరింది.ఇందులో ఆక్టివ్ కేసుల సంఖ్య 27 ,581. మహారాష్ట్రలో కరోనా సోకి చికిత్స పొందుతున్న వారిలో 65 మంది మరణించినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. మహారాష్ట్రలో కరోనాతో ఇప్పటివరకూ 1390 మంది మృత్యువాత పడ్డారు.