తెలంగాణలో కొత్తగా 2,058 కరోనా కేసులు.. మరో 09 మంది మృతి..!

కరోనా మహమ్మారి ఇంకా విజృంభిస్తూనే ఉంది. తెలంగాణలో గత కొద్ది రోజుల నుంచి భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదువ్వుతున్నాయి. నిన్న కేసుల సంఖ్య కాస్త తగ్గినట్టు కనిపించినా నేడు మళ్ళీ కేసుల సంఖ్య పెరిగింది. తాజాగా గడిచిన 24 గంటలలో 2,058 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా కరోనా కారణంగా మరో 09 మంది చనిపోయారు.

ఇక కరోనా నుంచి కోలుకుని నేడు 2,180 మంది డిశ్చార్జ్ అయ్యారు. అయితే తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,60,571 కి చేరింది. ఇదిలా ఉండగా కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 1,29,187 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 30,400 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 984 కి చేరింది.

ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో 51,247 మంది శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 22,20,586 టెస్ట్‌లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 80.45 శాతం ఉండగా, మరణాల రేటు 0.61% ఉన్నట్టు హెల్త్ బులెటిన్ తెలిపింది.