కరోనా వైరస్ ప్రపంచాన్ని
వణికిస్తున్న ఈ తరుణంలో జనాల్లో ఆరోగ్యం పట్ల స్పృహ ఎక్కువయింది. గతంలో ఎంత
చెప్పినా హానికర వస్తువులను విడవని వారు కూడా ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం
అంటున్నారు.
రోగ నిరోధక శక్తి, ప్రకృతి
సిద్దమైన వస్తువులు, మంచి ఆహారం పట్ల ప్రజల్లో అవగాహన బాగా పెరుగుతుంది. ఈ
క్రమంలోనే ప్రభుత్వాలు కూడా వీటిపై దృష్టి పెట్టాయి. ఆరోగ్యానికి హానికరం కాని
మంచి వస్తువుల తయారీ, వాడకాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి.
మినిస్ట్రీ ఆఫ్ జల్
శక్తి తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెదురు వాటర్ బాటిళ్ళను వాడాలంటూ, అవి ఒక్క
చుక్క నీరు కూడా కారకుండా ఎంతో నైపుణ్యంతో తయారు చేస్తున్నారని అందులో
పేర్కొన్నారు. ఫోటోలను షేర్ చేస్తూ
తెలియని వారికి అవగాహన కల్పించారు. అందుకు పలువురు ట్విట్టర్ పాలోవర్ల నుంచి కూడా
తాము ఈ వ్యాపారంలోకి దిగినట్లు ఫోటోలు షేర్ చేసుకున్నారు.