Health Latest bulletin: తెలంగాణ మళ్లీ పెరిగిన కరోనా కేసులు...!

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. నిన్న రాత్రి 8 గంటల వరకు మొత్తం 55,645 నమూనాలను పరీక్షించారు.

ఇందులో 682 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,74,540కి చేరింది.

ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1477కి చేరింది.

కరోనా బారి నుంచి నిన్న 761 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,65,367కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 7,696 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 5,634 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇప్పటి వరకు తెలంగాణలో నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 58,68,233కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో తాజాగా 119మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.