విడుదలకు సిద్దమయిన విజె చిత్ర తొలి ఆఖరి చిత్రం కాల్స్


ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నటి వి.జె.చిత్ర తొలి సినిమా ‘కాల్స్’ విడుదలకు సిద్ధమైంది. బుల్లితెరపై ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న చిత్ర ఎన్నో ఆశలతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది.

అయితే దురదృష్టవశాత్తూ చిత్ర నటించిన తొలి చిత్రమే ఆమె ఆఖరి చిత్రంగా మారింది. ఇన్‌ఫైనైట్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై ఎస్‌.జయకుమార్‌, జే. కావేరి సెల్వి నిర్మాణంలో 2019 జూలైలో ‘కాల్స్‌’ చిత్రం షూటింగ్‌ ప్రారంభమైంది, తీరా షూటింగ్ అయిపోయి రిలీజ్ అయ్యే టైం కి చిత్ర తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది...

అయితే చిత్ర ఆత్మహత్య కేసులో ఆమె భర్తను అరెస్ట్ చేసారు పోలీసులు .... ఆమె మరణం వెనుక మిస్టరీ ఉందన్న ఆరోపణలతో నషరత్‌పేట పోలీసులు కేసును తీవ్రంగానే పరిగణించాల్సి వచ్చింది. ఆమెతో పాటు హోటల్‌లో ఉన్న రిజిస్టర్‌ మ్యారేజ్‌ భర్త, ప్రియుడు హేమనాథ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆరు రోజులుగా ఆయన వద్ద విచారించారు. తొలుత పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో కేసును పలు కోణాల్లో విచారించారు. అనేక మంది వద్ద విచారణ సాగింది. చివరకు పోలీసులు తమదైన శైలిలో విచారించగా, చిత్ర ఆత్మహత్యకు హేమనాథ్‌ ప్రేరేపించినట్టు తేలింది.