డైరెక్టర్ గుణశేఖర్
హిరణ్యకశ్యప చిత్రం తెరకెక్కించనున్నట్టు ఇప్పటికే ప్రకటించాడు. వచ్చే
ఏడాది ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ సినిమా కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో
డైలాగ్స్ రాయించాలనుకుంటున్నాడట. ఈ చిత్రానికి కథతోపాటు సంభాషణల విషయంలో
గుణశేఖర్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని టాక్ నడుస్తోంది.
తొలినాళ్లలో త్రివిక్రమ్
శ్రీనివాస్ డైలాగ్ రైటర్ గా కెరీర్
ప్రారంభించారు. త్రివిక్రమ్ డైలాగ్ రైటర్
గా పనిచేసిన ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ గా మారారు. ఈ మాటల మాంత్రికుడు ప్రస్తుతం
క్లోజ్ గా ఉన్న వారి కోసం డైలాగ్స్ రాస్తున్నారని వార్తలు వచ్చాయి. గుణశేఖర్ రానా దగ్గుబాటితో హిరణ్య కశ్యప
చిత్రం చేస్తున్నట్టు గతంలోనే ప్రకటించాడు.