టాలీవుడ్ లో విషాదం నెలకుంది. ప్రముఖ గేయ రచయిత, గాయకుడు లింగరాజ్( 66) బుధవారం ఉదయం కన్నుమూశారు.
మాయదారి మైసమ్మ, కోడిపాయె లచ్చమ్మ వంటి పాటలతో ఆయన కుర్రకారులో ఉత్సాహాన్ని నింపారు.
తన కెరీర్ లో సుమారు 1000 కి పైగా పాటలు పాడిన లింగరాజ్ సంగీత ప్రయాణాన్ని.. అతడు 1987లో పాడిన మాయదారి మైసమ్మ పాట మలుపు తిప్పింది.
బొల్లారం ఆదర్శనగర్ లో నివసించే లింగరాజ్.. స్నేహితులతో కలిసి డిస్కో రికార్డింగ్ కంపెనీ (డీఆర్సీ) పేరుతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
వారితో కలిసి ఎన్నో జానపద గేయాలు పాడారు. దేవుళ్లు, దేవతలకు సంబంధించిన భజన పాటలు కూడా ఆయన కంపోజ్ చేశారు. కాగా లింగరాజ్ కు భార్య , ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
బుధవారం సాయంత్రం అతని అంత్రక్రియలు ముగిశాయి. లింగరాజ్ లేరనే వార్త తెలియడంతో.. ఆయన అభిమానులు విషాదంలో మునిగిపోయారు.