బాలీవుడ్లో యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ మరణంతో అందరూ నేపోటిజం మీద నిరసనలు వ్యక్తం చేసారు ..నేపోటిజం వల్లనే ఎంతో కెరీర్ ఉన్న సుశాంత్ అకస్మాత్తుగా మరణించాడు అని బాలీవుడ్లో కొందరు వ్యాఖ్యానిస్తున్నారు .. అయితే తాజాగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబుకు ఒక ఇంటర్వ్యూలో నేపోటిజం గురించి ప్రశ్న ఎదురయింది ..
అయితే దానికి సురేష్ బాబు స్పందిస్తూ నెపోటిజం గురించి నేను మాట్లాడను కానీ.. ఎవరికైనా టాలెంట్ ఉండాలి. ఇక సుశాంత్ కోణంలో చూస్తే అతను ఎంతో సాధించాడు. అతను స్టార్ అయ్యాడు. సూపర్స్టార్ కావాల్సినవాడు. నెపోటిజం అనేది తెలిసో తెలియకో ఉండొచ్చు. ఆ ప్రభావం సక్సెస్పుల్ అయిన వారికీ ఉంటుంది.. కానీ వారికీ ఉంటుంది. ఎవరికీ వారు ప్రూవ్ చేసుకోవాల్సిందే.
పెద్ద పెద్ద సూపర్స్టార్స్కి కూడా రెండు, మూడు సినిమాలు ప్లాప్ అయ్యి రెండు, మూడేళ్లు ఖాళీగా కూర్చున్న సందర్భాలు చాలా ఉన్నాయి. జీవితంలో ఆటుపోట్లు ఉంటాయి. వాటిని దాటుకుని ఎంత స్ట్రాంగ్గా ఉండాలనేది నేర్చుకోవాలి. తెలుగు విషయానికి వస్తే రవితేజ, నాని, విజయ్ దేవరకొండ, రాజ్తరుణ్ వీరందరూ స్టార్స్ ఎలా అయ్యారు. స్టార్ డైరెక్టర్స్, హీరోల కుటుంబాల్లో హీరోలుగా ట్రై చేసి ఫెయిల్ అయిన వారు చాలా మంది ఉన్నారు. ఉదాహరణకు నేను అభిరామ్కు అవకాశం ఇవ్వగలను కానీ.. తనే హీరోగా ఎదగాలి. ఎవరినీ బలవంతం చేయలేం. ప్రేక్షకులకు నచ్చాలి. మనకు ఏదైనా కావాలంటే బలంగా ప్రయత్నించాలి’’ అన్నారు.