చిత్రలహరి , ప్రతి రోజు పండగే చిత్రాలతో మెగా హిట్స్ అందుకున్న సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రం చేస్తున్నాడు.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర LLP బ్యానర్పై BVSN ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సుబ్బు డైరెక్ట్ చేస్తున్నాడు. సుబ్బు చిత్రానికి ఇది మొదటిది కావడం విశేషం.
నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుండగా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ సందర్భాంగా చిత్ర ట్రైలర్ ను విడుదల చేసి సినిమా ఫై అంచనాలు పెంచారు చిత్ర యూనిట్.
ట్రైలర్ లో సాయి ధరమ్ తేజ్ పెళ్ళికి, పెళ్ళానికి చాలా దూరంగా ఉండేలా కనిపిస్తున్నాడు. నభా నటేష్ని కలిసిన తర్వాత తన అభిప్రాయంలో మార్పులు వస్తాయేమోనని ట్రైలర్ని బట్టి అర్ధమవుతుంది.