తెలుగు సినీ పరిశ్రమలో దిగ్గజ రచయితలు పరుచూరి బ్రదర్స్ ..ఎన్ని అద్భుతమైన సినిమాలకు రచయితలుగా పనిచేసారు ..వీరిలో పరుచూరి వెంకటేశ్వరరావు పెద్దవాడు కాగా , పరుచూరి గోపాలకృష్ణ చిన్న వాడు..అయితే ఈ రోజు ఉదయం పరుచూరి వెంకటేశ్వరరావు సతీమణి విజయలక్ష్మి(74) గుండెపోటుతో కన్నుమూశారు. .
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని తన స్వగృహంలో మృతి చెందారు. విజయలక్ష్మి మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ తమ సంతాపాన్ని తెలియ జేస్తున్నారు.
మాటల రచయితగా, నటుడిగా ప్రసిద్ధుడు పరుచూరి వెంకటేశ్వరరావు. సోదరుడు పరుచూరి గోపాలకృష్ణతో కలిసి వందలాది తెలుగు సినిమాలకు కథ, మాటలు, స్క్రీన్ప్లే అందించారు. 1990ల అనంతరం తెలుగు సినీ రంగంలో, మరీ ముఖ్యంగా కమర్షియల్ సినిమాలలో, వారు ఎన్నదగిన విజయాలను అందుకున్నారు. అగ్ర కథానాయకులందరి సినిమాలకి పని చేసిన వీరు చివరిగా చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రానికి పని చేశారు.