హీరోయిన్ రీతూ వ‌ర్మ కు వ‌రుడు కావ‌లెను...!

హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు యంగ్ హీరో నాగ శౌర్య. ప్రస్తుతం సెట్స్ ఫై మూడు సినిమాలు ఉన్నాయి.

అందులో ల‌క్ష్మీసౌజ‌న్య దర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం ఒకటి. రీతూ వ‌ర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి వ‌రుడు కావ‌లెను అనే టైటిల్ ఖ‌రారు చేసారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైనర్ గా ప్రేక్ష‌కులను అల‌రించేందుకు సిద్ద‌మ‌వుతోంది.

దీపావళి కానుకగా చిత్రయూనిట్‌ టైటిల్‌, చిత్ర ఫస్ట్ గ్లిమ్స్‌ని విడుదల చేసింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ చిత్రంతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం అవుతోంది.

ఫస్ట్ గ్లిమ్స్‌ అందమైన వీడియోలో నాగశౌర్య, రీతువర్మ ఎంతో అందంగా కనిపిస్తున్నారు. ఈ చిన్న దృశ్యానికి విశాల్ చంద్రశేఖర్ అందించిన నేపథ్య సంగీతం మరింత వన్నె తెచ్చింది.