కరోనా కారణంగా సినిమా థియేటర్లు మూతపడటంతో గత తొమ్మిది నెలలుగా థియేటర్లో సినిమా అన్నది రిలీజ్ కాలేదు..అయితే కరోనా అంకాశాలు తొలగడంతో సినిమా హాల్స్ తెరిచేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది..ఇలా అనుమతి వచ్చిన తర్వాత టాలీవుడ్ లో రిలీజ్ అయితున్న మొదటి సినిమా సోలో బతుకే సో బెటర్...
మెగా మేనల్లుడు సాయి తేజ్ నటిస్తున్న ఈ సినిమాకు కొత్త దర్శకుడు సుబ్బు దర్శకత్వం వహిస్తున్నాడు.. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అయితే.. ఈ సినిమా రిలీజ్పై మెగాస్టార్ ట్వీట్ చేశాడు. లాక్డౌన్ తర్వాత విడుదలవుతున్న మొదటి సినిమా కావడంతో మెగాస్టార్ చిరంజీవి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలియజేశారు.
ఈ సినిమాకి లభించే ఆదరణ మొత్తం చిత్ర పరిశ్రమలోనే ఒక స్ఫూర్తిని, స్థైర్యాన్ని కలిగిస్తుందనడంలో సందేహం లేదని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ప్రేక్షకులు మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటిస్తూ ఈ చిత్రాన్ని థియేటర్స్లో ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుతున్నాను అంటూ ట్వీట్ చేశారు.