కరోనా వలన థియేటర్స్
అన్నీ మూత పడడంతో కొందరు నిర్మాతలు చేసేదేం లేక తమ చిత్రాలని ఓటీటీలో రిలీజ్
చేస్తున్నారు.
ఈ కోవలోనే శ్రీదేవి తనయ
జాన్వీ కపూర్ నటించిన ‘గుంజన్ సక్సేనా ద
కార్గిల్ గర్ల్' చిత్రం నెట్ఫ్లిక్స్ లో విడుదలకి సిద్ధమవుతుంది.
శరణ్శర్మ దర్శకత్వంలో
తెరకెక్కిన ఈ చిత్రాన్ని కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న భారతీయ తొలి మహిళా పైలట్
గుంజన్ సక్సేనా జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఇప్పటికే చిత్ర టీజర్
విడుదల కాగా, ఇది గుంజనా సక్సేనాని కూడా ఎంతగానో ఆకట్టుకుంది.
తాజాగా చిత్ర రిలీజ్ డేట్
ఫిక్స్ చేశారు మేకర్స్. ఆగస్ట్ 12న గుంజన్ సక్సేనా చిత్రాన్ని స్వాతంత్య్ర దినోత్సవ
శుభాకాంక్షలతో రిలీజ్ చేయబోతున్నారు. దఢఖ్ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన
జాన్వీ ఈ సినిమాలో తన నట విశ్వరూపం చూపించనుందని అంటున్నారు.
ఈ సినిమాలో జాన్వీతో పాటు
అంగద్ బేడీ, మానవ్ విజ్, పంకజ్ త్రిపాఠి, రజత్ బర్మేచా, నీనా గుప్తా, విజయ్ వర్మలు కూడా నటిస్తున్నారు.