సెట్స్లో షూటింగ్ జరుగుతున్న సమయంలో దర్శకుడు నారానీపుజ షానవాస్ హఠాత్తుగా కుప్పకూలారు. దీంతో వెంటనే అతడిని కోయంబత్తూరులోని కేజీ ఆస్పత్రికి తరలించగా వైద్యులు బ్రెయిన్ డెడ్గా నిర్ధారించారు.
ప్రస్తుతం ఆయన వెంటిలేటర్పై ఉన్నట్లు బంధువులు తెలిపారు. కాగా షానవాస్ ప్రస్తుతం 'గంధీరాజన్' సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం ఆయన పాలక్కడ్లోని ఆటపదిలో వేసిన సెట్స్లో చిత్రీకరణ జరుపుతుండగా గుండెపోటుతో కుప్పకూలారు.
దీంతో వెంటనే ఆయనను అత్యవసర చికిత్స కోసం కోయంబత్తూరులోని కేజీ ఆస్పత్రికి తరలించారు. అప్పటినుంచి అతడి పరిస్థితి విషమంగా ఉంది. నేడు ఉదయం అతడిని మరోసారి పరీశిలించిన డాక్టర్లు అతడికి బ్రెయిన్ డెడ్ అయినట్లు వెల్లడించారు.