సీనియర్ నటుడు, రచయిత, రంగస్థల కళాకారుడు రావి కొండలరావు మరణానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మంగళవారం సాయంత్రం ఒక ప్రకటన ద్వారా సంతాపం వ్యక్తం చేశారు. అప్పట్లో కొండల్రావు అత్యుత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉండేవాడని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్ధించారు.
ఇదిలా ఉండగా కొండలరావు గుండెపోటుతో బేగంపేటలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన సినీ రచయితగానే కాకుండా నటుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు.పెళ్లి పుస్తకం , భైరవ ద్వీపం వంటి సినిమాలకు రచయిత పని చేసాడు..
ఇక కొండల రావు మరణంపై మెగాస్టార్ చిరంజీవి కూడా సంతాపం తెలిపిన విషయం తెలిసిందే , సినీ ఇండస్ట్రీ పెద్ద దిక్కుని , బహుముఖ మేధావిని కోల్పోయింది అని మెగాస్టార్ వాఖ్యానించాడు ..కాగా కొండల రావు గారు చిరంజీవి హీరోగా నటించిన సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక పాత్రలు చేసారు ..