రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్కి మంచి ఆదరణ లభిస్తుంది. ప్రముఖ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, క్రీడా ప్రముఖులు ఇందులో భాగం అవుతున్నారు.
ఇప్పటికే పలువురు సినీ , రాజకీయ , క్రీడా , బిజినెస్ ప్రముఖులు ఈ ఛాలెంజ్ లో పాల్గొనగా తాజాగా ఆర్ఆర్ఆర్ నటుడు అజయ్ దేవగన్ పాల్గొన్నారు.
సంతోష్ కుమార్తో కలిసి మొక్కలు నాటిన అజయ్ దేవ్గణ్.. అందరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపు ఇచ్చారు. ప్రస్తుతం అజయ్ దేవగణ్ దర్శక నిర్మాణంలో రూపొందుతోన్న‘మే డే’ మూవీ రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరణ జరుపుకుంటోంది.
బిగ్బి అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో ప్రధానపాత్ర పోషిస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ లో అజయ్ కీలకపాత్రలో నటిస్తున్నారు.