దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితకథ ఆధారంగా తలైవి చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నటి కంగనారనౌత్ లీడ్ పోషిస్తోంది.
జయలలిత సినీ, రాజకీయ జీవితంలో కీలక పాత్ర పోషించిన ఎం.జి.రామచంద్రన్ (మక్కల్ తిలగమ్) పాత్రలో ప్రముఖ యాక్టర్ అరవింద్ స్వామి నటిస్తున్నాడు. తాజాగా చాలా రోజుల తర్వాత తలైవి నుంచి ఎంజీఆర్ లుక్ ఒకటి బయటకు వచ్చింది.
స్టేజ్పై నుంచి వైట్ డ్రెస్ లో ఉన్న ఎంజీఆర్ (అరవింద్స్వామి) ప్రజలకు విక్టరీ సింబల్ ను చూపిస్తున్న స్టిల్ అందరినీ ఆకట్టుకుంటోంది. రేపు ఎంజీఆర్ వర్థంతి సందర్భంగా ఉదయం 10 గంటలకు తలైవి నుంచి న్యూ లుక్ విడుదల చేయనున్నట్టు అరవింద్ స్వామి ట్వీట్ చేశాడు.