ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఒప్పో
సోమవారం మరో బడ్జెట్ ఫోన్ను లాంచ్ చేసింది. ఎంట్రీ లెవల్ స్మార్ట్ఫోన్
విభాగంలో ఒప్పో ఏ12 పేరిట
భారత్లో విడుదల చేసింది. 6.22
అంగుళాల వాటర్ డ్రాప్ డిస్ప్లే ఈ ఫోన్ ప్రత్యేకత. కొత్త ఫోన్ రెండు వేరియంట్లలో
లభించనుంది. భారత్లో 3GB
RAM + 32GB స్టోరేజ్ మోడల్ ధర రూ.9,990 కాగా, 4GB RAM
+ 64GB స్టోరేజ్ ధర రూ.11,490గా నిర్ణయించారు.
ఏ12 స్మార్ట్ఫోన్ బ్లూ, బ్లాక్ రెండు రంగుల్లో లభించనుంది.
జూన్ 10 నుంచి ఈ ఫోన్ కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది.
ఒప్పో ఏ12 లాంచింగ్ ఆఫర్లలో భాగంగా బ్యాంక్ ఆఫ్ బరోడా
క్రెడిట్ కార్డ్ ఈఎంఐ, ఫెడరల్
బ్యాంక్ డెబిట్ కార్డ్ ఈఎంఐ
ఆప్షన్లపై ఐదు శాతం క్యాష్బ్యాక్ ఆఫర్
అందించనుంది. జూన్ 21లోగా ఫోన్
కొనుగోలు చేసే వినియోగదారులకు ఆరు నెలల పాటు అదనపు వారంటీ కూడా లభిస్తుంది.
ఒప్పో ఏ12 స్మార్ట్ఫోన్ ప్రత్యేకతలు* ఫోన్
డిస్ప్లే: 6.22
అంగుళాలు
* ర్యామ్
మెమరీ: 3 జీబీ
*ఇంటర్నల్
స్టోరేజ్: 32 జీబీ
* ఫోన్లో
వదిన ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో పీ35
* ముందు
భాగంలో కెమెరా: 5 మెగా
పిక్సల్
* వెనుక
భాగంలో కెమెరా: రెండు 13 మెగా
పిక్సల్ మరియు 2 మెగా
పిక్సల్
* బ్యాటరీ
బ్యాక్ అప్ కెపాసిటీ: 4230 mAh
* ఆపరేటింగ్
సిస్టం: ఆండ్రాయిడ్ 9 గా
ఉంటుంది