భద్రాద్రి రామయ్య నేడు కూర్మావతాలరంలో దర్శనం...


భద్రా‌చ‌లం‌లోని శ్రీసీ‌తా‌రామ చంద్రస్వామివారు ఇవాళ కూర్మావతారంలో దర్శనమివ్వనున్నారు. ఈనెల 24 నుంచి ఆలయ పుష్కరిణిలో లక్ష్మణ సమేత సీతారాములకు తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఈనెల 25న తెల్లవారుజామున 5 గంటలకు ఉత్తరద్వార దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో శివాజీ అన్నారు. కరోనా కారణంగా ఉత్తరద్వార దర్శనానికి పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతిస్తామన్నారు. స్వామివారు రోజుకు ఒక అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

ఈనె 15 నుంచి 25వ తేదీ వరకు పగలు పత్తు ఉత్సవాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఉత్సవాల సందర్భంగా విద్యుత్‌ దీపాలు, పూలమాలలతో ఆలయాన్ని సుందరంగా అలంకరిస్తున్నారు. అదేవిధంగా ఈనెల 25 నుంచి జనవరి 4వ తేదీవరకు రాపత్తు ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు.