Advertisement

  • నోరూరుంచే వేడి వేడి చికెన్ స‌మోసా తయారీ

నోరూరుంచే వేడి వేడి చికెన్ స‌మోసా తయారీ

By: chandrasekar Fri, 31 July 2020 10:33 AM

నోరూరుంచే వేడి వేడి చికెన్ స‌మోసా తయారీ


రుచికరమైన చికెన్ స‌మోసా వేడి వేడిగా సర్వ్ చేస్తే ఇష్టపడనివారు ఎవ్వరు వుండరు. సమోసా అంటేనే పిల్లలకు నోట్లో నీరూరుతుంటాయి. అలా బయటికి వెళ్లి వేడి వేడి సమోసాలను తినడానికి చాలా ఇష్టపడుతుంటారు. కాని బయట దొరికే సమోసాల వల్ల అనారోగ్యం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇలా కాకుండా ఇంట్లోనే సమోసాలను తయారుచేసుకోవడమే ఉత్తమం మరియు ఆరోగ్యం. అందులోనూ చికెన్ అంటే అమితంగా ఇష్టపడే పిల్లలకు చికెన్‌తో ఇంట్లోనే సమోసా చేసిపెడితే ఆరోగ్యానికి ఆరోగ్యం ఆనందానికి ఆనందం. రుచికరమైన, నోరూరించే చికెన్ సమోసాను తయారుచేయడం కూడా చాలా సులభం. ముందుగానే అన్ని సిద్దంగా చేసుకుంటే చాలు చివరి నిమిషంలో జస్ట్ ఫ్రై చేసి, వేడి వేడిగా చట్నీ లేదా సాస్‌తో తింటే ఆ అనుభూతే వేరుగా ఉంటుంది. మరి చికెన్ సమోసాను ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.

కావల్సిన పదార్థాలు:

* చికెన్‌ (కీమా) - 1 కప్పు (లేదా) అవసరాన్ని బట్టి పరిమాణం పెంచుకోవచ్చు
* కారం పొడి- 2 స్పూన్లు
* గరం మసాల - స్పూను
* పసుపు - అర స్పూను
* సోంపు పౌడర్‌ - స్పూను
* ఉప్పు - తగినంత
* మిరియాల పొడి - అరస్పూను
* ఉల్లిపాయలు - 3 (సన్నగా తరిగినవి)
* నూనె - వేయించడానికి సరిపడా
* అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ - 2 స్పూన్లు
* పచ్చిమిర్చి - 3 (సన్నగా తరిగినవి)
* గుడ్డు - 1
* గోధుమపిండి - కప్పు
* మైదాపిండి - 2 కప్పులు
* ధనియాల పొడి - 2 స్పూన్లు
* నిమ్మకాయ -1
* నీళ్లు - అవసరానికి తగ్గట్టు
* కొత్తిమీర - కావలసినంత

preparation,hot hot,chicken,samosa,norur ,నోరూరుంచే , వేడి వేడి , చికెన్,  స‌మోసా,  తయారీ


తయారుచేయు విధానం:

ముందుగా కడాయిలో నూనె వేసి వేడి చేయాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులోనే అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో చికెన్‌ మిన్స్‌ను (సన్నగా తరిగిన చికెన్ లేదా చికెన్ కీమా) జోడించాలి. తర్వాత అందులోనే సోంపు పౌడర్‌, మిరియాలు, ధనియాలపొడి, పసుపు, ఉప్పు, గరం మసాలా, కారం, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి మొత్తం మిశ్రమాన్ని కలపుకోవాలి.

ఈ మిశ్రమాన్ని బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో.. గోధుమ పిండి, మైదాపిండి, గుడ్డు, చిటికెడు ఉప్పు వేసి మెత్తగా కలిపి 15 నిమషాలు అలాగే పెట్టాలి. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని చిన్నచిన్న చపాతీల మాదిరిగా చేసుకోవాలి. వాటి మధ్యలో ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్న చికెన్‌ మిశ్రమాన్ని నింపి సమోసాల మాదిరిగా ఒత్తుకోవాలి.

అదనపు రుచికోసం మిశ్రమంలో నిమ్మరసం, కొత్తిమీర వేసుకోవచ్చు. ఈ విధంగా తయారుచేసుకున్న సమోసాలను నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకూ వేయించుకోవాలి. తర్వాత తీసిన సమోసాలను వేడి వేడిగా సాస్‌తో కలిపి తింటే అదిరిపోతుంది.

Tags :
|

Advertisement