మఖానా (తామర గింజలు) కర్రీ
By: chandrasekar Thu, 21 May 2020 6:57 PM
భారతదేశంలో, మఖానాలు
సాధారణంగా ఉపవాసం ఉన్నప్పుడు వినియోగిస్తారు, వాటి బలమైన పోషక విలువలు వున్నాయి. సాధారణంగా తామర
విత్తనాలు లేదా నక్క గింజలు అని పిలుస్తారు, వీటిని అనేక ఆహారాలు లేదా భారతీయ వంటకాల తీపి వంటలలో
కూడా ఉపయోగిస్తారు.
వివిధ వంటకాల్లో బాగా
ప్రాచుర్యం పొందిన పదార్ధంగా ఉండటంతో పాటు, నక్క గింజలను పోషక చిరుతిండిగా కూడా ఉపయోగించవచ్చు.
అదనంగా, మధ్యయుగ
కాలం నుండి వైద్యానికి కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. మానవ శరీరానికి చాలా
ముఖ్యమైన అనేక సూక్ష్మపోషకాలు కూడా వీటిలో ఉన్నాయి.
కావలసినవి
పదార్థాలు:
* తామర గింజలు -
కప్పు
* పచ్చి బఠాణీ -
అరకప్పు
* పసుపు - అర
టీస్పూన్
* కారం - రెండు
టీస్పూన్లు
* ధనియాల పొడి -
టేబుల్స్పూన్
* ఉల్లిపాయ - ఒకటి
* టొమాటో ప్యూరీ -
కప్పు
* పావు టీస్పూన్-
జీలకర్ర
* గరంమసాలా -
టీస్పూన్
* నూనె - రెండు
టేబుల్స్పూన్లు
* ఉప్పు - తగినంత
* కొత్తిమీర -
గార్నిష్ కోసం
తయారీ విధానం
పేస్టు తయారు
చేయుటకు* ఉల్లిపాయ - ఒకటి
* వెల్లుల్లి - ఐదు
రెబ్బలు
* జీడిపప్పు - ఐదు
పలుకులు
* అల్లం -
చిన్నముక్క
* నూనె - సరిపడా
* గసగసాలు - ఒక
టీస్పూన్
ముందుగా పేస్టు తయారీ
కోసం పాన్లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసి వేగించాలి. అల్లం ముక్క, వెల్లుల్లి
రెబ్బలు వేయాలి. బాగా వేగిన తరువాత స్టవ్ పైనుంచి దింపాలి. గసగసాలు, జీడిపప్పు
వేసి కలియబెట్టాలి. చల్లారిన తరువాత మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా
నీళ్లు పొసి మెత్తటి పేస్టులా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్లో
తామరగింజలు వేసి చిన్నమంటపై వేగించాలి. కాసేపు వేగిన తరువాత ప్లేట్లోకి తీసుకొని
పక్కన పెట్టాలి.
పాన్లో నూనె వేసి వేడి
అయ్యాక జీలకర్ర, ఉల్లిపాయలు వేసి వేగించాలి. తరువాత రెడీ చేసి
పెట్టుకున్న పేస్టు వేసి చిన్నమంటపై రెండు నిమిషాలు ఉడకనివ్వాలి. కొద్దిసేపటికి
టొమాటో ప్యూరీ, కారం, ధనియాలపొడి, పసుపు వేసి కలియబెట్టాలి. మూతపెట్టి చిన్నమంటపై ఐదు
నిమిషాలు ఉడకనివ్వాలి. బఠాణీలు వేసి తగినంత ఉప్పు చల్లుకుని కాసిన్ని నీళ్లు పోసి
మరో మూడు నాలుగు నిమిషాలు ఉడికించాలి.ఇప్పుడు వేగించి
పెట్టుకున్న తామర గింజలు వేయాలి. చిన్నమంటపై మరికాసేపు ఉడకనివ్వాలి. చిక్కటి
గ్రేవీ తయారవుతుంది. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని దింపాలి. ఈ
కూరచపాతీలోకి లేదా పులావ్లోకి రుచిగా ఉంటుంది.