మీఠా పారే(షక్కర్ పారా) తయారు చేయడం ఎలా?
By: chandrasekar Sat, 13 June 2020 8:44 PM
మీథే పారేను ఉత్తర భారతదేశంలో
షక్కర్ పారా, షక్కర్ పారే అని కూడా అంటారు. ఇది సాధారణంగా ఉత్తర
భారతీయులు తరచుగా చేసుకునే సాంప్రదాయక ఆహారంలో ఇది ఒకటి. ఈ స్వీట్ సాయంత్రం టీ -
టైం లో స్నాక్స్ కోసం సెలక్ట్ చేసుకోవచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు, ఈ మీథే
పారే స్వీట్ని ఇష్టపడని వారంటూ ఉండరు. ఈ ఐటెం గొప్పదనం ఏంటంటే, దీన్ని
ఏకంగా వారం పాటు గాలి చొరబడని ఎయిర్ టైట్ కంటైనర్లలో నిల్వచేసుకుని తినొచ్చు.
కావలసిన పదార్థాలు:
*250 గ్రాములు మైదా
*3 టీ స్పూన్ నెయ్యి
*1/2 కప్ చక్కర
*అవసరాన్ని బట్టి నీళ్ళు
తయారుచేయు విధానం:
*ఒక గిన్నెను తీసుకుని, అందులో నీరు, చక్కెర
వేసి బాగా కలపండి. చక్కెర పూర్తిగా నీటిలో కరిగేవరకు కలపండి.
*ఈ మిశ్రమంలో నెయ్యిని వేసి 3 నుండి
4
నిమిషాలపాటు మళ్లీ కలపండి. ఆపై అందులో మైదాని వేసి మెత్తని పిండిగా
తయారుచేసుకోండి. ఈ పిండి మెత్తగా మారిన తర్వాత, 1 నుండి ఒకటిన్నర గంటల పాటు పక్కన ఉంచండి.
*కొంత సమయం తరువాత, (చపాతీ పీట) మీద పిండిని వేసి, పిండిని
చిన్ని చిన్ని భాగాలుగా తయారు చేయండి. రోలింగ్ పిన్కు నూనె రాసి, పిండిని
మందంగా ఫ్లాట్బ్రెడ్ లా చేయండి.
*ఈ ఫ్లాట్ బ్రెడ్ ను మీరు కోరుకున్న ఆకారంలో కట్ చేసి, బంగారు
గోధుమ రంగు వచ్చేవరకు పాన్లో వేయించండి. ఈ క్రంచీ మీథే పారేను సర్వ్ చేయండి.