జొన్నలు, రాగులు, సజ్జలతో దోసె, ఇడ్లీ...అల్లం పచ్చడి
By: chandrasekar Mon, 13 July 2020 6:09 PM
కావలసినవి:
ఉప్పుడు బియ్యం – ఒక
కప్పు
పిండి కోసం: స్ప్రౌట్స్
– ఒక కప్పు
మినప్పప్పు – ఒక కప్పు
మెంతులు – ఒక టీ స్పూను
ఉప్పు – తగినంత
పిండి తయారీ: ఉప్పు మినహా
పిండి కోసం చెప్పిన మిగతా పదార్థాలకు తగినన్ని నీళ్లు జత చేసి, సుమారు
నాలుగు గంటలసేపు నానబెట్టాలి ∙నీళ్లు ఒంపేసి, నానబెట్టిన వాటిని గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బాక, ఒక
పాత్రలోకి తీసుకోవాలి ∙సుమారు ఎనిమిది గంటలపాటు ఈ పిండిని నానబెట్టాలి ∙ఈ పిండితో
దోసెలు, ఇడ్లీలు
తయారుచేసుకోవచ్చు ∙అల్లం చట్నీతో అందించాలి ∙ఈ అల్పాహారం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
చట్నీతయారీకి కావలసినవి:
ఎండు మిర్చి – 12
పచ్చి సెనగ పప్పు – 2
టేబుల్ స్పూన్లు
అల్లం – చిన్న ముక్క
వెల్లుల్లి రెబ్బలు – 3
మెంతులు – అర టీ స్పూను
ధనియాలు – 2
టేబుల్ స్పూన్లు
జీలకర్ర – ఒక టీ స్పూను
కరివేపాకు – పావు కప్పు
ఇంగువ – అర టీ స్పూను
చింతపండు – పావు కప్పు
కంటె ఎక్కువ
బెల్లం పొడి – పావు కేజీ
అల్లం చట్నీ తయారీ: ఒక
గిన్నెలో చింతపండుకు తగినన్ని నీళ్లు జత చేసి కొద్దిసేపు నానబెట్టాలి ∙స్టౌ మీద
బాణలిలో నూనె వేసి కాగాక, ధనియాలు, పచ్చి సెనగ పప్పు, లవంగాలు, మెంతులు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు, అల్లం ముక్క వేసి వేయించి ఒక పాత్రలోకి తీసుకోవాలి∙
బాగా చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి∙ నానబెట్టిన చింతపండు, కొద్దిగా
నీళ్లు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి∙ బెల్లం పొడి, ఉప్పు
జత చేసి పచ్చడి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టాలి ∙దోసె, ఇడ్లీలతో
అందించాలి. ఇందులో నూనె ఎక్కువగా వాడలేదు. మినుముకు విరుగుడైన అల్లం చట్నీతో తినడం
వల్ల శరీరం గట్టి పడుతుంది.