పర్యావరణ కాలుష్యానికి అమెరికా వంటి దేశాలే కారణం...
By: chandrasekar Fri, 11 Dec 2020 10:12 PM
అమెరికా వంటి పాశ్చాత్య
దేశాలే ప్రపంచ వ్యాప్తంగా కాలుష్యం పెరగడానికి కారణమని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి
జవడేకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యావరణ కాలుష్యానికి భారత్ ఎంత మాత్రమూ కారణం
కాదని పేర్కొన్నారు. భారత దేశం నుంచి కేవలం 3 శాతం మాత్రమే కాలుష్య కారకాలు విడుదలవుతున్నాయి.
పర్యావరణ కాలుష్యంలో
అమెరికా వాటా అత్యధికంగా 25 శాతమని, ఇక 22 శాతంతో యూరప్ రెండో స్థానంలో ఉండగా 3వ
స్థానంలో 13 శాతంతో చైనా ఉందని చెప్పారు. అలాంటప్పుడు పర్యావరణ
కాలుష్యానికి భారత్ ఏ విధంగా కారణమవుతుందో తెలియజేయాలని ప్రశ్నించారు.
గత వంద ఏళ్లుగా భూమిపై కాలుష్యం గణనీయంగా
పెరుగుతోందని జవడేకర్ పేర్కొన్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రపంచ దేశాలన్నీ
ఆలోచన చేయాలని తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో పోస్ట్ చేసారు.