భారత్ తో ఘర్షణకు దిగటం ద్వారా జిన్పింగ్ తనకు తానుగా నాశనాన్ని తెచ్చుకున్నాడు
By: chandrasekar Tue, 15 Sept 2020 6:15 PM
చైనా అధ్యక్షుడు జిన్పింగ్
తన దూకుడు చర్యల ద్వారా అనుకోని అపజయాలను మూటగట్టుకున్నారు. భారత సైన్యంతో పీఎల్ఏ
ఘర్షణకు దిగడం ద్వారా దూకుడును పెంచిన జిన్పింగ్ సరిహద్దులోని భూభాగంలోకి చొరబడటంతో తన
భవిష్యత్తును పణంగా పెట్టారని అమెరికాకు చెందిన ప్రముఖ మ్యాగజైన్ న్యూస్ వీక్ తన
కథనంలో పేర్కొంది. భారత్ తో సరిహద్దులో ఘర్షణకు పథక రచన స్వయంగా జిన్పింగ్
చేశారని, అయితే
భారత దళాలు పీఎల్ఏను తిప్పికొట్టడంతో తీవ్ర భంగపాటుకు లోనైయ్యాడు. ఇప్పటికే చైనా
ప్రజలతోపాటు పాలక కమ్యూనిస్టు పార్టీలో జిన్పింగ్ తీవ్ర వ్యతిరేకత
ఎదుర్కొంటున్నాడు. చైనా ప్రజలు, తన పార్టీ నాయకుల ద్రుష్టిని మరల్చేందుకుగాను జిన్పింగ్ భారత సరిహద్దులో ఘర్షణ వాతావరణానికి ప్లాన్
చేశారని, అయితే
భారత సైన్యం అనుకోని విధంగా పోటీ ఇవ్వడంతో అపజయాన్ని మూటగట్టుకున్నారని న్యూస్
వీక్ తన కథనంలో తెలిపింది.
వరుస వైఫల్యాల నుంచి
బయటపడేందుకు దిద్దుబాటు చర్యలను ప్రారంభించినట్లు తెలుస్తున్నది. అయితే, అది
దిద్దుబాటులా కాకుండా భారత్ పట్ల మరోసారి మరింత దూకుడుగా, క్రూరంగా
వ్యవహరించే అవకాశాలున్నాయని న్యూస్ వీక్ అభిప్రాయపడింది. భారత సైన్యంతో ఘర్షణకు
దిగి వెనకడుగు వేసిన పీఎల్ఏ వైఫల్యాలు తప్పనిసరిగా పరిణామాలను కలిగివుంటాయని, ఇటీవలి
పరిణామాలు సాయుధ దళాల్లో విరోధుల స్థానంలో విశ్వసనీయులతో భర్తీ చేసేందుకు జిన్పింగ్కు
సాకు లభించినట్లయిందని తన కథనంలో పేర్కొంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్
మిలిటరీ కమిషన్ చైర్మన్గా, పీఎల్ఏ, పాలక
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా నాయకుడిగా ఉన్న జిన్పింగ్ను ఆయన వైఫల్యాలు భారత్ కు
వ్యతిరేకంగా మరో దాడని జరిపేందుకు మరింతగా ప్రేరేపిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదని
న్యూస్ వీక్ హెచ్చరిస్తోంది.