జీ ఎంటర్టైన్మెంట్ ఆంధ్రప్రదేశ్ కు సాయం...
By: chandrasekar Thu, 15 Oct 2020 6:16 PM
ఆంధ్రప్రదేశ్ కు 'జీ
ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్' తనవంతు
సాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చింది. కరోనా నివారణకు తమ జాతీయ కార్పోరేట్
సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్
(జీ) తన వంతుగా ఏపీ ప్రభుత్వానికి అధికారికంగా 10 అంబులెన్సులు, 4,000 పీపీఈ కిట్లను అందించింది. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట
రామయ్య, ఏపీఐఐసీ
చైర్మన్ ఆర్. కే. రోజా, డాక్టర్ మల్లికార్జున, సీఈవో వైఎస్ఆర్ ఆరోగ్య
శ్రీ హెల్త్ ట్రస్ట్, బి. రాజశేఖర్ రెడ్డి, అదనపు సీఈవో వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ హెల్త్ ట్రస్ట్
సమక్షంలో అంబులెన్సులు, పీపీఈ కిట్లను అందించింది. కరోనాతో
జరుగుతున్న పోరాటంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి
మద్దతునందించడానికి జీ కట్టుబడి ఉందని మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్
ఆఫీసర్ పునీత్ గోయెంకా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కుఅంబులెన్సులు, పీపీఇ
కిట్లను అందించిన జీ యాజమాన్యానికి రవాణా, ఐ అండ్ పీఆర్ మంత్రి పేర్ని వెంకట రామయ్య ధన్యవాదాలు
తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ -19 ఉపశమనం కోసం ప్రయతిస్తున్న ఈ సమయంలో మాకు మద్దతు
ఇచ్చినందుకు పునిత్ గోయెంకా, జీ ఎంటర్టైన్మెంట్కు ఏపీఐఐసీ చైర్మన్ రోజా
ధన్యవాదాలు తెలిపారు.
కరోనాకు వ్యతిరేకంగా
దేశంలో ఆరోగ్య సంరక్షణ మౌలికవసతులను మెరుగుపరిచేందుకు దేశవ్యాప్త సీఎస్ఆర్
డ్రైవ్లో భాగంగా 240కు పైగా అంబులెన్సులు, 46 వేల పీపీఈ కిట్లు, 90కు
పైగా ఆక్సిజన్ హ్యుమిడిఫయర్లు, 6 లక్షలకు పైగా రోజువారీ భోజనాలను అందించడానికి జీ
కట్టుబడిందని సంస్థ తెలిపింది. ఈ విరాళాన్ని ఈ జాతీయ స్థాయి సీఎస్ఆర్ డ్రైవ్లో
భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించారు. 3400 మందికి పైగా ఉద్యోగులు పీఎం కేర్స్ ఫండ్కు తోడ్పాటునందించారు.
ఉద్యోగులు అందించిన మొత్తాలకు సమానమైన మొత్తాన్ని జీ జత చేసి దానిని పీఎం కేర్స్
ఫండ్కు విరాళంగా అందించింది. బాధ్యతాయుతమైన మీడియా, ఎంటర్టైన్మెంట్ సంస్ధగా, కరోనాతో
పోరాటాన్ని తీవ్రతరం చేయడానికి అవసరమైన చర్యలను జీ కొనసాగిస్తున్నదని తెలిపింది.