Advertisement

  • జహీరాబాద్ లో కేవలం ఉదయం పది గంటల వరకు మాత్రమే షాపులు ఓపెన్ ..

జహీరాబాద్ లో కేవలం ఉదయం పది గంటల వరకు మాత్రమే షాపులు ఓపెన్ ..

By: Sankar Mon, 27 July 2020 11:23 AM

జహీరాబాద్ లో కేవలం ఉదయం పది గంటల వరకు మాత్రమే షాపులు ఓపెన్ ..



దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు ..నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో యాబై వేళా పాజిటివ్ కేసులు దేశంలో నమోదు అయ్యాయి ..ఇక ఇటు రెండు తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి కూడా అంతే ఉంది ..దీనితో ఇప్పటికే పలు చోట్ల మరోసారి లాక్ డౌన్ ప్రక్రియ మొదలయ్యింది. పలు గ్రామాల ప్రజలు సైతం తమ ఊరిలో కరోనా కేసులు పెరగకుండా ముందు జాగ్రత్త చర్యగా తమకు తాముగా లాక్ డౌన్ ప్రకటిస్తున్నారు. బయటవారిని గ్రామంలోకి రాకుండా అడ్డుకుంటున్నారు.

తాజాగా సంగారెడ్డి జిల్లాలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో, ఆ జిల్లాలోని జహీరాబాద్ లో లాక్ డౌన్ విధించాలని అధికారులు నిర్ణయించారు. ఈరోజు నుంచి జహీరాబాద్ పట్టణంలో లాక్ డౌన్ అమలు చేశారు. ఉదయం 10 గంటల వరకు మాత్రమే షాపులు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చారు. 10 గంటల తరువాత అన్ని రకాల షాపులు మూసేయాలని అధికారులు నిర్ణయించారు.

కాగా తెలంగాణాలో హైదరాబాద్ లోనే గాక మిగిలిన జిల్లాలో కూడా కరోనా కేసులు విపరీతంగా నమోదు అయితున్నాయి ..దీనితో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో లాక్ డౌన్ విదించుకుంటున్నారు ..గ్రామాలలో కూడా స్వచ్చంధ లాక్ డౌన్ అమలు చేసుకుంటున్నారు..

Tags :
|
|
|

Advertisement