Advertisement

  • మళ్లీ గ్రౌండ్‌లో తన సత్తా చాటేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న యువరాజ్ సింగ్

మళ్లీ గ్రౌండ్‌లో తన సత్తా చాటేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న యువరాజ్ సింగ్

By: chandrasekar Wed, 16 Sept 2020 3:48 PM

మళ్లీ గ్రౌండ్‌లో తన సత్తా చాటేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న యువరాజ్ సింగ్


భారత స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ మళ్లీ గ్రౌండ్‌లో అడుగుపెట్టి తన సత్తా చాటేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మళ్లీ క్రికెట్ ఆడబోతున్నట్లు స్వయంగా యువరాజ్ సింగ్ ధృవీకరించారు. దేశీయ క్రికెట్‌లో పంజాబ్ రాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యంవహించనున్నట్లు యూవీ ప్రకటించారు.

రిటైర్మెంట్ నిర్ణయాన్ని విరమించుకున్న యూవీ నిర్ణయం పట్ల ఆయన ఫ్యాన్స్ హర్షం వ్యక్తంచేస్తున్నారు. యువరాజ్ సింగ్‌లో క్రికెట్ ఇంకా మిగిలే ఉందని మళ్లీ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకోవడం సరైన నిర్ణయంగా అభిప్రాయపడుతున్నారు. అటు సోషల్ మీడియాలోనూ యూవీ ఫ్యాన్స్ తమ సంతోషాన్ని వ్యక్తంచేస్తూ ట్వీట్స్ చేశారు. టీ20 మ్యాచ్‌లో యూవీ ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదడాన్ని గుర్తుచేసుకుంటూ యూవీ దేశీయ క్రికెట్‌లో ఆడినా తాము ఆ మ్యాచ్‌లు మిస్ కాకుండా చూస్తామని కామెంట్స్ చేస్తున్నారు.

దేశీయ క్రికెట్‌లో ధోనీ తన సత్తాను చాటి మళ్లీ వన్డే క్రికెట్‌ ఆడాలని ఆయన ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. యువరాజ్ సింగ్ కెరీర్‌ను ఎంఎస్ ధోనీ పాడుచేశాడని యూవీ తండ్రి గతంలో పలు సందర్భాల్లో బహిరంగ ఆరోపణలు చేశారు. వన్డే, టెస్ట్ క్రికెట్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో యువరాజ్ సింగ్ మళ్లీ దేశీయ క్రికెట్‌లో అడుగుపెట్టాలని నిర్ణయించుకోవడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Tags :

Advertisement