సన్ రైజర్స్ యువ ఆటగాడు అబ్దుల్ సామాద్ పై ప్రశంసలు కురిపించిన యువి , ఇర్ఫాన్
By: Sankar Mon, 09 Nov 2020 4:54 PM
ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయినా ఆ జట్టు తుది వరకూ చేసిన పోరాటం ఆకట్టుకుంది. ప్రధానంగా కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఆరెంజ్ ఆర్మీ ఓదశలో గెలుపు దిశగా పయనించింది. కేన్ విలియమ్సన్-అబ్దుల్ సామద్లు ఆడుతున్నంతసేపు మ్యాచ్ సన్రైజర్స్ వైపే మొగ్గింది.
కానీ విలియమ్సన్ (45 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 67 పరుగులు) ,సామద్ (16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 33 పరుగులు) స్వల్ప వ్యవధిలో ఔటైన తర్వాత సన్రైజర్స్ వెనుకబడిపోయింది. ఆ క్రమంలోనే ఢిల్లీ తిరిగి పుంజుకుని ఫైనల్కు అడుగుపెట్టింది..కాగా, జమ్మూ కశ్మీర్ ఆటగాడైన సామద్పై టీమిండియా మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్లు ప్రశంసలు కురిపించారు.
ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ను సామద్ గెలిపిస్తే బాగుండేది.. కానీ అతను పోరాడిన తీరు ఆకట్టుకుంది. ప్రత్యేకంగా సామద్ పవర్ గేమ్ అదిరింది’ అని ఇర్ఫాన్ కొనియాడాడు. ఇక ఇర్ఫాన్ ట్వీట్కు యువరాజ్ రిప్లై ఇస్తూ..‘ అతనిలో సత్తా ఏమిటో తెలిసింది. భవిష్యత్తులో అతనొక స్పెషల్ ప్లేయర్గా ఎదుగుతాడు’ అని ప్రశంసించాడు.