ఇండియన్ క్రికెట్ అభిమానులకు శుభవార్త ..రిటైర్మెంట్ వెనక్కి తీసుకోనున్న యువరాజ్ సింగ్
By: Sankar Thu, 10 Sept 2020 07:46 AM
టీం ఇండియా దిగ్గజ ఆటగాడు యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించి ఏడాది దాటిపోయింది..చాల మంది అభిమానులు ఫేర్ వెల్ మ్యాచ్ లేకుండా యువీ రిటైర్మెంట్ ప్రకటించడం పట్ల తీవ్ర నిరాశ వ్యక్తం చేసారు..సరిగ్గా 14 నెలల తర్వాత యువరాజ్ తన మనసు మార్చుకున్నట్లుగా అనిపిస్తుంది.
తాజాగా రిటైర్మెంట్ వెనక్కి తీసుకుని పంజాబ్ క్రికెట్లో డమస్టిక్ లీగ్లు ఆడాలని భావిస్తున్నాడు. అలా మెల్లిగా మిగతా ఫార్మాట్లలోనూ బరిలో దిగనున్నట్లు తెలుస్తున్నది. అనుభవజ్ఞుడైన యువీ సేవలు రంజీ జట్టుకు అవసరమని..జట్టులో ఆటగాడిగా ఉంటూనే యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశకుడిగా వ్యవహరించాలని పంజాబ్ క్రికెట్ సంఘం ఇంతకముందు యూవీని కోరిన విషయం తెలిసిందే.
గతంలో తాను ప్రకటించిన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నానంటూ బుధవారం యువరాజ్ బీసీసీఐకి లేఖ రాశాడు. ఈ విషయాన్ని యూవీ స్వయంగా వెల్లడించాడు. తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకొని దేశీయ క్రికెట్ ఆడేందుకు అనుమతి ఇవ్వాలంటూ బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, కార్యదర్శి జై షాకు లేఖ రాసినట్లు తెలిపాడు ఒకవేళ యువీకి అనుమతి లభిస్తే మళ్లీ విదేశీ లీగ్ల్లో పాల్గొనేందుకు అతనికి అవకాశం ఉండదు. కాగా యువరాజ్.. బిగ్బాష్ లీగ్లో ఆడనున్నట్లు వార్తలు వచ్చిన ఒక్కరోజు వ్యవధిలోనే యూవీ ఇలా యూటర్న్ తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.