శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పవన్ ను అడ్డుకున్న వైస్సార్సీపీ కార్యకర్తలు
By: Sankar Fri, 04 Dec 2020 11:54 AM
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే..తాజాగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పర్యటిస్తున్న పవన్ కు వైస్సార్సీపీ కార్యకర్తల నుంచి నిరసన ఎదురయింది...
రైతులను పరామర్శించేందుకు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్న పొయ్య గ్రామానికి పవన్ వెళ్లారు. అక్కడ పవన్ను రాకుండా అధికార పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు.. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు కనిపించాయి. జనసేన పార్టీ కార్యకర్తలు కూడా భారీగా అక్కడే మోహరించారు..పంటలను పరిశీలించి అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు.
చిత్తూరు జిల్లా పర్యటను ముగించుకుని పవన్ కళ్యాణ్ నెల్లూరు జిల్లా నాయుడుపేట చేరుకుంటారు. అక్కడ రైతులను కలిసి పంట నష్టం వివరాలను తెలుసుకుంటారు. 12 గంటలకు గూడూరు చేరుకుంటారు.. అక్కడి రైతులతో మాట్లాడిన అనంతరం మనుబోలు, వెంకటాచలం మీదుగా నెల్లూరు చేరుకుంటారు