Advertisement

  • వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి, సోదరికి నాంపల్లి ప్రజా ప్రతినిధుల కేసుల విచారణ కోర్టు ఆదేశం...

వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి, సోదరికి నాంపల్లి ప్రజా ప్రతినిధుల కేసుల విచారణ కోర్టు ఆదేశం...

By: chandrasekar Wed, 04 Nov 2020 3:01 PM

వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి, సోదరికి నాంపల్లి ప్రజా ప్రతినిధుల కేసుల విచారణ కోర్టు ఆదేశం...


హైదరాబాద్, నాంపల్లి ప్రజా ప్రతినిధుల కేసుల విచారణ కోర్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ, సోదరి షర్మిలకు కోర్ట్ షాకిచ్చింది. ఎట్టిపరిస్థితుల్లోనూ కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులపై విచారణ జరిపింది. ఇందులో భాగంగా పరకాలలో 2012లో ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసును విచారించారు. ఈ సందర్భంగా ఈ నెల 10న వైఎస్ విజయమ్మ, షర్మిల, కొండా సురేఖ, కొండా మురళి కచ్చితంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.

వైఎస్సార్ మరణం తర్వాత కొండా సురేఖ దంపతులు మంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న తరుణంలో ఉపఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో కొండా సురేఖ వైసీపీ తరఫున పోటీకి దిగగా, ఆమె తరఫున వైఎస్ విజయమ్మ, షర్మిల ఎన్నికల ప్రచారానికి వచ్చారు. అయితే 2012 జూన్ 12న ఎన్నికల సందర్భంగా సభ నిర్వహించారు. అయితే ఈ సభకు అనుమతి లేదని వైఎస్ విజయమ్మ, షర్మిల, కొండా సురేఖ, కొండా మురళిపై కేసు నమోదైంది. తాజాగా, ఈ కేసుకు సంబంధించి వీరు ఖచ్చితంగా కోర్టుకు హాజరుకావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Tags :
|

Advertisement