Advertisement

ప్రియుడిపై యాసిడ్ దాడి చేసిన ప్రియురాలు

By: Sankar Fri, 04 Sept 2020 12:43 PM

ప్రియుడిపై యాసిడ్ దాడి చేసిన ప్రియురాలు


ఇద్ద‌రికి ఇద్ద‌రూ ప్రాణంగా ప్రేమించుకున్నారు. కానీ పెళ్లి చేసుకునేందుకు యువ‌కుడు ఇష్ట‌ప‌డ‌ లేదు. అత‌ను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో అత‌న్ని ప్రేమించిన యువ‌తిలో కోపం ర‌గిలిపోయింది. వారం రోజుల వ్య‌వధిలోనే యువ‌కుడిపై యాసిడ్‌తో రెండుసార్లు దాడి చేసింది.

ఈ ఘ‌ట‌న క‌ర్నూల్ జిల్లా నంద్యాల మండ‌లం పెద్ద‌కొట్టాల‌లో చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకోలేద‌నే కోపంతోనే నాగేంద్ర అనే యువ‌కుడిపై ఆ యువ‌తి యాసిడ్ దాడి చేసిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. ఇటీవ‌లే నాగేంద్ర మ‌రో యువ‌తిని వివాహ‌మాడాడు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ఇద్దరి కులాలు వేరని, ప్రేమ పెళ్లికి ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని నాగేంద్ర ఆమెతో ప్రేమకు బ్రేకప్‌ చెప్పాడు. ఆ తర్వాత వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో ప్రియుడి వివాహాన్ని జీర్ణించుకోలేకపోయింది సుప్రియ. అతడిపై యాసిడ్‌ దాడికి పాల్పడింది. యాసిడ్‌ దాడిలో నాగేంద్ర ముఖం, చెయ్యి బాగా కాలిపోవటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Tags :
|
|
|
|
|

Advertisement