Advertisement

  • పెళ్లి లేట్ అయితుంది అని ఆత్మహత్య చేసుకున్న యువతి

పెళ్లి లేట్ అయితుంది అని ఆత్మహత్య చేసుకున్న యువతి

By: Sankar Tue, 08 Sept 2020 12:12 PM

పెళ్లి లేట్ అయితుంది అని ఆత్మహత్య చేసుకున్న యువతి


కరీంనగర్ జిల్లాలోని బెజ్జంకి మండలంలో దారుణం చోటుచేసుకుంది. తన పెళ్లి ఆలస్యం అవుతోందనే బెంగతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బెజ్జంకి మండలం ఎల్లంపల్లికి చెందిన వడిగె శిరీష డిగ్రీ వరకు చదివింది. ప్రస్తుతం ఇంటి వద్ద ఉంటోంది.

కోహెడ మండలం మైసంపల్లికి చెందిన వజ్జెపల్లి శ్రావణ్‌, శిరీష మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇరువైపులా తల్లిదండ్రులు వారి పెళ్లికి అంగీకరించారు. శిరీష తండ్రి నర్సింగం సౌదీ అరేబియాలో గొర్ల కాపరిగా పని చేస్తున్నారు. ఆమె తల్లి ఇక్కడ వ్యవసాయ కూలీ చేస్తోంది. శిరీషకు పెళ్లయిన అక్క ఉంది. ప్రస్తుత కరోనా లాక్ ‌డౌన్‌ నేపథ్యంలో విమానాలు నడవక తండ్రి నర్సింగం భారత్‌ కు రాలేకపోయారు.

తండ్రి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుందువని తల్లి పలుమార్లు సముదాయించారు. అయినా పెళ్లి ఆలస్యం అవుతోందనే చింతతో ఆగస్టు 28న శిరీష పురుగుమందు తాగింది. కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందింది. ఆమె తల్లి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు

Tags :
|

Advertisement