Advertisement

పెళ్లి బారాత్ లో గొడవ ...యువకుడు దారుణ హత్య

By: Sankar Fri, 11 Dec 2020 10:07 AM

పెళ్లి బారాత్ లో గొడవ ...యువకుడు దారుణ హత్య


పెళ్లి అంటేనే సందడి ..అమ్మాయి తరుపు వారు , అబ్బాయి తరుపు వారు అందరు ఎంతో ఉత్సహంగా , కోలాహలంతో పెళ్లి వేడుకలు జరుపుకుంటారు ..

ఇక తెలంగాణాలో అయితే పెళ్ళికి బారాత్ వంటి వాటితో యువత తమను తాము మైమరచిపోయి డ్యాన్స్‌ చేస్తూ ఉంటారు. అయితే ఈ ఊపులో కొన్నిసార్లు గొడవలు జరిగే సందర్భాలను చూస్తూనే ఉంటాం. అలా పెండ్లి ఊరేగింపులో జరిగిన చిన్పపాటి గొడవ ఓ యువకుని హత్యకు దారితీసింది.

జగిత్యాల జిల్లాలోని మేడిపల్లి మండలం బీమారం గ్రామంలో నిన్న ఓ పెళ్లి వేడుక జరిగింది. సాయంత్రం పెళ్లి ఊరేగింపు నిర్వహించారు. ఇందులో జరిగిన గొడవ కారణంగా పూదరి లక్ష్మణ్ అనే యువకుడిని దారుణంగా హత్య చేశారు.

ఈ ఊరేగింపులో లక్ష్మణ్‌తో పాటు ముగ్గురు యువకులు పాల్గొన్నారు. వారు లక్ష్మణ్‌తో గొడవప పడ్డారు. దీంతో ఆ యువకులు అతన్ని కత్తితో పొడిచి చంపేశారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :
|

Advertisement